భార్యని దారుణంగా హ‌త్య చేసిన భ‌ర్త‌

byసూర్య | Fri, Nov 19, 2021, 08:17 AM

తన జీవితానికి నీడగా ఉంటానని అనుకున్న భర్త తన భార్యను తలపై బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుద్వేల్ రాజేంద్రనగర్ సర్కిల్ స్టేషన్ లో నివాసముంటున్న జంగయ్య(55), మీనా(47) దంపతులకు ముగ్గురు సంతానం. అయితే గత కొన్ని రోజులుగా జంగయ్య మానసిక స్థితితోపాటు ఆరోగ్యం కూడా క్షీణిస్తోంది. ఈ క్రమంలో కుటుంబ విషయమై జంగయ్య, మీనా మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో జంగయ్య మీనా తలపై బండరాయితో కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న మనీ ఒక్కసారిగా ఇంట్లో కుప్పకూలింది. విషయం తెలుసుకున్న స్థానికులు మీనాను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మీనా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. జంగయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. జంగయ్య కూడా గతంలో ఓ హత్య కేసులో నిందితుడు.


Latest News
 

లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లు పూర్తి చేయాలి Fri, Mar 29, 2024, 08:01 PM
ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు.. కదం తొక్కుదాం: కేటీఆర్ Fri, Mar 29, 2024, 07:57 PM
11 గంటల ఆపరేషన్.. 12 ఏళ్ల బాలికకు కొత్త జీవితం.. అరీట్ హాస్పిటల్స్ అరుదైన రికార్డు Fri, Mar 29, 2024, 07:54 PM
కాటేదాన్‌లో దారుణం.. మహిళ తలపై బండరాయితో మోది హత్య Fri, Mar 29, 2024, 07:50 PM
నెత్తిన పాలు పోస్తున్న రేవంత్..? లోక్ సభ ఎన్నికల తర్వాత ఏం జరగనుంది Fri, Mar 29, 2024, 07:47 PM