byసూర్య | Thu, Nov 18, 2021, 09:10 PM
మాసాయిపేట మండలంలోని హకీంపేట్, అచ్చంపేట గ్రామాల్లో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు చెందిన జమున హేచరీస్లో భూముల సర్వేను గురువారం పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ తెలిపారు.జమున హేచరీస్ తమ భూములను ఆక్రమించిందని స్థానిక రైతుల ఆరోపణల మేరకు సర్వే నిర్వహించామని, ఆక్రమణలపై కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ (సీఏడీ) పూర్తి చేసిన తర్వాతే ఓ నిర్ధారణకు వస్తామని కలెక్టర్ తెలిపారు.అయితే భూనిర్వాసితులకు పక్కాగా పట్టాలు వేసి భూములను అప్పగిస్తామని చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రెండు గ్రామాల్లోని 77,78,79, 80, 81, 82, 97, 130 సర్వే నంబర్లలో సర్వేలు నిర్వహించామన్నారు. కాగా, తమకు న్యాయం చేయాలంటూ రైతులు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యకర్తలు నిరసనలు చేపట్టారు.