byసూర్య | Thu, Nov 18, 2021, 06:08 PM
సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్రావు పై రాయదుర్గం, నార్సింగి, గచ్చిబౌలి, బంజారాహిల్స్ పరిధిలో మొత్తం ఏడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసుల బెంగళూరులో శ్రీధర్రావును అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. రాయదుర్గంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించిన శ్రీధర్రావు వాటిని విక్రయించే వ్యవహారంలో డబుల్ రిజిస్ట్రేషన్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేయడంపై పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దానితో ఉప్పరపల్లి కోర్టు శ్రీధర్రావుకు 14 రోజుల పాటు రిమాండ్ విధించి శ్రీధర్రావును చర్లపల్లి జైలుకు పోలీసులు తరలించింది.