byసూర్య | Thu, Nov 18, 2021, 05:58 PM
హైదరాబాద్ : యాసంగి వరి సాగు, వరి ధాన్యం సేకరణపై తెలంగాణ రైతుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, కేంద్ర వైఖరి స్పష్టం చేయాలని మహాధర్నా అనంతరం కేశవరావు నేతృత్వంలో తెరాస ప్రతినిధి బృందం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ని కలిశారు. ధాన్యం కొనుగోళ్లపై గవర్నర్ కు వినతిపత్రం ఇచ్చిన నేతలు. రాష్ట్రంలో మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్ర ఇష్టారీతిన మాట మారుస్తోందన్నారు. కేంద్రం ఒక మాట, రాష్ట్ర భాజపా నేతలు మరోమాట చెబుతూ రైతుల్ని గందరగోళ పరుస్తున్నారని ఆరోపించారు.