byసూర్య | Wed, Oct 27, 2021, 10:54 AM
హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి హరీశ్ రావుపై బీజేపీ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కేటీఆర్ని ఓడించాలని కుట్ర పన్నిందే హరీశ్ రావేనని ఆరోపించారు. దళిత ఉద్యోగ బిడ్డను బూతులు తిట్టి కొట్టిన దళిత విద్రోహి హరీశ్ రావు అని అన్నారు. దుబ్బాకలో చెల్లని హరీష్ రావు హుజురాబాద్లో చెల్లుతారా అని ప్రశ్నించారు.