byసూర్య | Wed, Oct 27, 2021, 09:01 AM
హుజూరాబాద్ లో ఉప ఎన్నికల ప్రచారానికి టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ వెళ్లడం లేదు. ఈసీ నిబంధనల మేరకు బుధవారం రాత్రి 7 గంటలకు ప్రచార గడువు ముగియనుంది. ఈసీ నిబంధనల కారణంగానే తాము సీఎం కేసీఆర్ సభను నిర్వహించలేకపోయామని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ విలేకరులకు తెలిపారు. హుజూరాబాద్ లో చివరిరోజు ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తాలని, మరింత ఉత్సాహంతో పనిచేయాలని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రతి ఒక్క ఓటరుకు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించి, పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు ఓటు వేసేలా అభ్యర్థించాలన్నారు. బుధవారం తెల్లవారుజామున పార్టీ నేతలతో మరోసారి టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.