byసూర్య | Wed, Oct 27, 2021, 08:46 AM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు నేపథ్యంలో బుధవారం కుత్బుల్లాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ రవికుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 11 కేవీ వెంకన్న హిల్స్ ఫీడర్ నుంచి హెచ్ఎంటి సబ్ స్టేషన్ పరిధిలో సీపీ ఆర్ కాలనీ, వెంకన్న హిల్స్ మోడీ బిల్డర్స్, భూమి రెడ్డి కాలనీ, ఫస్ట్ ఎవెన్యూ, శివ రెడ్డి నగర్, వెంకటేశ్వర నగర్, ప్రశాంత్ నగర్ ప్రాంతాలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, 11 కేవీ గణేష్ నగర్ ఫీడర్ నుంచి చింతల్ సబ్ స్టేషన్ పరిధిలో గణేష్ నగర్, జనహిత ఆస్పత్రి, కల్కి భగవాన్ ఆలయం , రామి రెడ్డి నగర్ ప్రాంతాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని వినియోగదారుల సహకరించాలని ఆయన కోరారు.