byసూర్య | Wed, Oct 27, 2021, 07:53 AM
తెలంగాణ ఆర్టీసీ డిజిటల్ చెల్లింపుల విధానంలో మరో అడుగు ముందుకేసింది. హైదరాబాద్లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో క్యూఆర్ కోడ్, యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే విధానానికి శ్రీకారం చుట్టింది. ఎంజీ బస్ స్టేషన్లోని టికెట్ కేంద్రాల్లో క్యూఆర్ కోడ్, యూపీఐ ద్వారా చెల్లింపుల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. టికెట్ రిజర్వేషన్, పార్సిల్, కార్గో సర్వీసులకు ఈ డిజిటల్ పేమెంట్స్ సేవలు వర్తించనున్నాయి. సికింద్రాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్)లో ఈ తరహా చెల్లింపు సేవలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.