క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్

byసూర్య | Tue, Oct 26, 2021, 04:55 PM

టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లపై బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రికెట్ లైవ్ గురూ యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ మీడియాకు తెలిపారు. నిందితుల నుంచి రూ. 14.92 లక్షలు, ల్యాప్‌టాప్, 9 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహించే ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. బెట్టింగ్‌ల గురించి తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. అంతేకాకుండా వారికి నగదు ప్రోత్సాహం కూడా ఇస్తామని సీపీ తెలిపారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM