విదేశీ కరెన్సీతో పట్టుబడ్డ మహిళ..

byసూర్య | Tue, Oct 26, 2021, 03:37 PM

విదేశీ కరెన్సీని అక్రమంగా తరలిస్తున్న మహిళా ప్రయాణికురాలిని శంషాబాద్‌ విమానాశ్రయలో సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఈకే-275 విమానంలో అబుదాబి వెళ్లడానికి వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి లగేజీని సాధారణ తనిఖీల్లో భాగంగా సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు పరిశీలించారు. అందులో 50,500 సౌదీ రియాల్స్‌ (భారత కరెన్సీ విలువలో రూ.9.77 లక్షలు) బయటపడ్డాయి. దీంతో సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు మహిళను కస్టమ్స్‌ అధికారులకు అప్పగించారు. ఫెమా చట్టం కింద మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM