byసూర్య | Tue, Oct 26, 2021, 03:23 PM
పబ్లిక్ హెల్త్ డైరెక్టర్పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో నో వ్యాక్సిన్-నో రేషన్ స్టేట్మెంట్ ఇవ్వడమేంటని ప్రభుత్వ పెద్దలు ప్రశ్నించారు. పెన్షన్లు నిలిపేస్తామని చెప్పడానికి మీరెవరంటూ డీహెచ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీహెచ్ను సచివాలయానికి పిలిపించి సీఎస్ సోమేష్కుమార్ క్లాస్ తీసుకున్నారు. ప్రభుత్వ పెద్దల ఆగ్రహంతో తన వ్యాఖ్యలను డీహెచ్ వెనక్కి తీసుకున్నారు.