టీఆర్‌ఎస్‌ పై ఎస్‌ఈసీకి టీపీసీసీ వికలాంగుల విభాగం ఫిర్యాదు

byసూర్య | Tue, Oct 26, 2021, 02:27 PM

హుజూరాబాద్‌ ఉపఎన్నిక లో టీఆర్‌ఎస్‌కు ఓట్లేయకపోతే వికలాంగుల పింఛన్లు తొలగిస్తామని ఆ పార్టీ నేతలు బెదిరిస్తున్నారని టీపీసీసీ వికలాంగుల విభాగం చైర్మన్‌ ముత్తినేని వీరయ్యవర్మ తెలిపారు. ఇల్లందకుంట మండలం వంతడుపుల గ్రామంలో జరిగిన వికలాంగుల సమావేశంలో టీఆర్‌ఎస్‌కు ఓట్లేయకుంటే పింఛన్లు కట్‌ చేస్తామని వికలాంగుల కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ వాసుదేవరెడ్డి చెప్పారన్నారు.


ఓటర్లను ప్రలోభపెట్టడంతో పాటు వికలాంగులను భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ), డీజీపీలకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసినట్లు సోమవారం ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. వెంటనే ఆయనపై తగిన చర్యలు తీసుకుని వికలాంగ ఓటర్లకు మనోధైర్యం కల్పించాలని ముత్తినేని కోరారు


Latest News
 

స్పోర్ట్స్ క్యాంప్ పోస్టర్ ను ఆవిష్కరించిన కలెక్టర్ Tue, Apr 16, 2024, 02:48 PM
ఎండల నేపథ్యంలో ఆర్టీసీ కీలక నిర్ణయం Tue, Apr 16, 2024, 02:48 PM
మహాజన్ సంపర్క్ అభియాన్ Tue, Apr 16, 2024, 02:04 PM
ఎల్లమ్మ తల్లికి గ్రామస్తుల ప్రత్యేక పూజలు Tue, Apr 16, 2024, 01:30 PM
నిరుపేద వధువుకు పుస్తె, మట్టెలు అందజేత Tue, Apr 16, 2024, 12:31 PM