byసూర్య | Tue, Oct 26, 2021, 01:53 PM
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు ఎన్ని కథలు పడ్డా కూడా కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసి, ఈయనను పార్టీ నుండి కేసీఆర్ బయటకు వెళ్లగొట్టేది భవిష్యత్తులో తప్పని పరిణామమని పేర్కొన్నారు విజయశాంతి. ఢిల్లీ లో దళిత ఉద్యోగులను అత్యంత దారుణంగా బూతులు తిట్టి, చెయ్యి చేసుకుని కొట్టి అవమానించిన హరీష్ రావుకు హుజూరాబాద్ ఎన్నికల బాధ్యత అప్పగించడం సిగ్గుచేటని మండిపడ్డారు.
అందుకు మొదట హరీష్ రావు గారు ముక్కు నేలకు రాసి దళితులకు క్షమాపణ చెప్పి ఉండాలని డిమాండ్ చేశారు విజయ శాంతి. కానీ ఇంతవరకూ ఆ పని హరీష్ రావు చేయలేదని.. ఇక హరీష్ రావు దళిత బంధు గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనని చురకలు అంటించారు. దళితద్రోహి కేసీఆర్ గారికి, దళిత ద్వేషి హరీష్ రావుకు హుజూరాబాద్ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టవలసిన సందర్భం ఇదన్నారు.