byసూర్య | Tue, Oct 26, 2021, 01:50 PM
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రామంజాపూర్ వెంకటేశ్వరాలయంలో చోరి జరిగింది. స్వామి వారి కిరీటాలు, శఠగోపం, పంచలోహ విగ్రహాలు, బంగారు, వెండి నగలతో పాటు హుండీని దొంగలు ఎత్తుకెళ్లారు. అలాగే ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసి డీవీఆర్ను తీసుకెళ్లారు. మంగళవారం ఉదయం పూజారి ఆలయం వద్దకు చేరుకోగా ఆలయం అప్పటికే తెరిచి ఉంది. దాంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు పోలీసులు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.