కేసీఆర్, హరీశ్ రావులపై సంచలన వ్యాఖ్యలు చేసిన : విజయశాంతి

byసూర్య | Tue, Oct 26, 2021, 12:15 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావులపై బీజేపీ నాయకురాలు విజయశాంతి నిప్పులు చెరిగారు. దళితుల పట్ల ఏమాత్రం గౌరవం లేని హరీశ్ రావుకు హుజూరాబాద్ ఎన్నికల బాధ్యతను కేసీఆర్ అప్పగించడం సిగ్గుచేటని విమర్శించారు. ఢిల్లీలో దళిత ఉద్యోగులను అత్యంత దారుణంగా హరీశ్ రావు బూతులు తిట్టారని, చేయి కూడా చేసుకున్నారని ఆమె అన్నారు. కేసీఆర్ దళిత ద్రోహి అయితే... హరీశ్ రావు దళిత ద్వేషి అని దుయ్యబట్టారు. వీరిద్దరికీ హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టాల్సిన సమయం ఆసన్నమయిందని అన్నారు.హరీశ్ రావు దళిబంధు గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని విజయశాంతి విమర్శించారు. దళితుల పట్ల అగౌరవంగా ప్రవర్తించిన హరీశ్ రావు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని అన్నారు. హరీశ్ ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని కథలు పడినా... కేటీఆర్ ను కేసీఆర్ సీఎం చేస్తారని, హరీశ్ రావును పార్టీ నుంచి వెళ్లగొడతారని చెప్పారు.


 


 


Latest News
 

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు.. ఈసారి పోలీసులే Fri, Apr 19, 2024, 07:32 PM
ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ నేత సిరిపెల్లి దంపతుల మృతి.. చిన్నతనంలోనే పీపుల్స్ వార్‌లోకి Fri, Apr 19, 2024, 07:29 PM
హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌కు మరో షాక్... రేపు కాంగ్రెస్‌ గూటికి ఇంకో ఎమ్మెల్యే Fri, Apr 19, 2024, 07:26 PM
కొత్త రేషన్‌ కార్డుల పంపిణీకి ముహూర్తం.. మంత్రి పొన్నం ప్రభాకర్ Fri, Apr 19, 2024, 07:22 PM
అమ్మతనం కోసం ఆరాటం.. ఆ చిలుకూరి బాలాజీయే ఉక్కిరిబిక్కిరి Fri, Apr 19, 2024, 07:18 PM