byసూర్య | Tue, Oct 26, 2021, 12:01 PM
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక సామాన్యుడి నడ్డి విరిచేలా పెట్రోల్ ధరలు భారీగా పెంచారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో 50 రూపాయలు ఉన్న పెట్రోల్ ధర ఇప్పుడు 110 రూపాలకు చేరిందన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెండు దేశ ప్రజలను గ్యాస్, పెట్రోల్ పేరుతో దోచుకుంటున్నాయన్నారు. పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని వీహెచ్ పేర్కొన్నారు.