byసూర్య | Tue, Oct 26, 2021, 11:55 AM
సరదాగా ముగ్గురు స్నేహితులు ఈతకు వెళ్లగా ఇద్దరు ప్రమాదవశాత్తు మునిగిపోయారు. అందులో ఒకరు మృతి చెందగా మరోకరు గల్లంతయ్యారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని వెంకటాపూర్లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం సజ్జన్ పల్లి గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులు కలిసి వెంకటాపూర్ కత్వల్ వద్ద సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతయిన ఇద్దరిలో ఒకరి మృత దేహం లభ్యమైంది. మరొకరి కోసం సిబ్బంది గాలిస్తోంది.