byసూర్య | Tue, Oct 26, 2021, 11:53 AM
యదాద్రి ఆలయ గోపుర బంగారు తాపంకు మేడ్చల్ జిల్లా కీసర మండల అంకిరెడ్డి పల్లి ఎంపీటీసీ, జిల్లా ఎంపిటిసిల ఫోరం అధ్యక్షురాలు పండుగ కవితశశికాంత్ ముదిరాజ్ 36వేల విరాళంను మంత్రి మలారెడ్డికి అందజేశారు. మంగళవారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన కవిత దంపతులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యదాద్రి అలయంకు తమ మామ పండుగ రామకృష్ణ జ్ఞాపకార్ధం బంగారు తాపంకు ముందుకు వచ్చినట్లు మంత్రికి తెలిపారు. ఆలయ అభివృద్ధిలో తమ అంకిరెడ్డి పల్లి గ్రామస్థులం పాలుపంచుకోవడం గర్వంగా ఉందన్నారు. బాధ్యతతో విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఎంపిటిసి కవిత దంపతులను మంత్రి మలారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.