byసూర్య | Tue, Oct 26, 2021, 11:43 AM
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా ములుగు మండలంలోని బండారుపల్లి సమీపంలో జరిగింది. ములుగు మండలంలోని మల్లంపల్లికి చెందిన బోల్ల భిక్షపతి (45) బండారుపల్లిలోని పాఠశాల వసతి గృహంలో తన కుమార్తెను చేర్పించి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా అతని బైక్ విద్యుత్తు స్తంభాన్ని ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు.