byసూర్య | Tue, Oct 26, 2021, 11:15 AM
హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. హుజురాబాద్లో ప్రలోభాల పర్వం కొనసాగుతోందన్నారు. ఊర్లను బార్లుగా మార్చి, మద్యం ఏరులు పారిస్తున్నారన్నారు. ప్రభుత్వ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. పౌరులు ఏ పార్టీలో ఉండాలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయిస్తోందన్నారు. మేథావులు, పత్రికా, మీడియా యాజమాన్యాలు ఆలోచించాలన్నారు. తన మొహం కనిపించకుండా చేసేందుకు ఇప్పటికే ఐదువందల కోట్ల నల్లధనం ఖర్చు చేశారన్నారు. ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని ఈటల పేర్కొన్నారు.