ఊర్లను బార్లుగా మార్చి.. మద్యం ఏరులు పారిస్తున్నారు: ఈటల

byసూర్య | Tue, Oct 26, 2021, 11:15 AM

 హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్‌లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. హుజురాబాద్‌లో ప్రలోభాల పర్వం కొనసాగుతోందన్నారు. ఊర్లను బార్లుగా మార్చి, మద్యం ఏరులు పారిస్తున్నారన్నారు. ప్రభుత్వ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. పౌరులు ఏ పార్టీలో ఉండాలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయిస్తోందన్నారు. మేథావులు, పత్రికా, మీడియా యాజమాన్యాలు ఆలోచించాలన్నారు. తన మొహం కనిపించకుండా చేసేందుకు ఇప్పటికే ఐదువందల కోట్ల నల్లధనం ఖర్చు చేశారన్నారు. ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని ఈటల పేర్కొన్నారు.


Latest News
 

గుర్తు తెలియని మగ వ్యక్తి శవం లభ్యం Fri, Apr 19, 2024, 03:39 PM
ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపును పరిశీలించిన కలెక్టర్ Fri, Apr 19, 2024, 03:38 PM
వ్యాపార కాంక్షతోనే బీబీ పాటిల్ పోటీ Fri, Apr 19, 2024, 03:37 PM
ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెన్షన్: డీఈవో రాజు Fri, Apr 19, 2024, 03:35 PM
జాతీయ రహదారిలో ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్ Fri, Apr 19, 2024, 03:33 PM