byసూర్య | Tue, Oct 26, 2021, 10:31 AM
పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులపై సోమవారం కేతేపల్లి పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గుడివాడ గ్రామంలో దేవరకొండ జానయ్య ఇంట్లో కొంతమంది పేకాట అవుతున్నారని సమాచారంతో దాడి చేసి పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తుల నుండి 23,150 రూ: స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో చిత్తలూరి లక్ష్మయ్య, చిత్తలూరి సైదులు, ఎరుకల అంజయ్య, దేవరకొండ అంజయ్య పై కేసు నమోదు చేశారు.