రోడ్డు ప్రమాదంలో ఫోటో గ్రాఫర్ మృతి

byసూర్య | Tue, Oct 26, 2021, 09:12 AM

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం సంజీవని ట్రస్ట్ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫోటోగ్రాఫర్ పేర్ల కోండల్ రెడ్డి (25) అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే నాంపల్లి మండలం బండ తిమ్మాపురం గ్రామానికి చెందిన కొండల్ రెడ్డి ఫోటో గ్రాఫర్ గా జీవనం కొనసాగిస్తూ కొండమల్లేపల్లిలో నివాసం ఉంటున్నాడు. సోమవారం రాత్రి ఫోటోగ్రఫీకి సంబంధించిన డబ్బులకోసం బైక్ పై వెళ్లి వస్తుండగా సంజీవని ట్రస్ట్ సమీపంలో పొట్టు లారీని ఢీకొని కింద పడిపోయాడు. వెంటనే లేచేలోగా వెనుక నుండి వచ్చిన కారు బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా కొండల్ రెడ్డి మృతి పట్ల దేవరకొండ ఫొటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ ఆసోసియేషన్ సంతాపం ప్రకటించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM