27న తెలంగాణ బంద్‌కు మావోల పిలుపు

byసూర్య | Tue, Oct 26, 2021, 08:18 AM

ములుగు జిల్లా టేకులగూడ అడవిలో జరిగింది బూటకపు ఎన్‌కౌంటర్‌గా సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి జగన్ ప్రకటించారు. నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో రీజనల్ సెంటర్ సీఆర్సీ కంపెనీ-2కు చెందిన కామ్రేడ్ నరోటి దామాల్, మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా గట్ట ప్రాంతానికి చెందిన పూనెం భద్రు, బీజాపూర్ జిల్లా పెద్దకోర్మ గ్రామానికి చెందిన సోడి రామాల్ అలియాస్ సంతోష్, బీజాపూర్ జిల్లా బాసగూడెం ప్రాంతం మల్లిపాడుకుచెందిన మరో కామ్రేడ్ మరణించినట్టుగా జగన్ తెలిపారు. ములుగు జిల్లా టేకులగూడ బోగస్ ఎన్ కౌంటర్‌కు నిరసనగా నవంబర్ 27న తెలంగాణ బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చినట్టుగా ఆయన పేర్కొన్నారు. అమాయకులని పట్టుకుని అడవిలోకి తీసుకెళ్లి కాల్చి చంపారని జగన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.


Latest News
 

స్క్రాప్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం Fri, Mar 29, 2024, 11:44 AM
ఎమ్మెల్యేను కలిసిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు Fri, Mar 29, 2024, 11:44 AM
దారుణ... కాటేదాన్ లో మహిళ హత్య Fri, Mar 29, 2024, 11:42 AM
హత్యకేసులో నిందితుడి రిమాండ్ Fri, Mar 29, 2024, 11:41 AM
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ Fri, Mar 29, 2024, 11:16 AM