byసూర్య | Mon, Oct 25, 2021, 06:37 PM
స్వరాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసి, రాష్ట్రాన్ని సాధించి, అభివృద్ధి పథం వైపు నడిపిస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా టీఆర్ఎస్ పార్టీ నిలిపిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది వేడుకల సందర్భంగా రెండు కవితలను కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ గళం.. బలం.. అగ్రగామి దళం.. టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మట్టి కోసమే పుట్టి గమ్యాన్ని ముద్దాడిన విముక్తి కేతనానికి 20 ఏండ్ల పండుగ అంటూ కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.