byసూర్య | Mon, Oct 25, 2021, 03:22 PM
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా వీదేశీ కరెన్సీ పట్టుబడింది. సోమవారం ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద అక్రమంగా తరలిస్తున్న 10 లక్షలకుపైగా విదేశీ కరెన్సీని అధికారులు పట్టుకున్నారు. ఈవై-275 అనే విమానంలో దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన అలియా భాను అనే ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అతడి వద్ద 10 లక్షలకు పైగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం అతడిని తమ ఆదీనంలోకి తీసుకున్నారు.