byసూర్య | Mon, Oct 25, 2021, 03:12 PM
హైదరాబాద్: పుట్టింటికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఓ గర్భిణి ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం లింగారెడ్డి గూడ వద్ద చోటు సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్నగర్కు చెందిన దాసరి శైలజ పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురంలో పుట్టింటికి వెళ్లి తిరిగి కారులో వస్తున్నది. ఈ క్రమంలో లింగారెడ్డిగూడ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. కారులో ఉన్న శైలజ మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలవగా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.