byసూర్య | Mon, Oct 25, 2021, 02:55 PM
సికింద్రాబాద్ సంగీత్ కీస్ హై స్కూల్ వద్ద వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. బైక్పై వెళుతున్న కూరగాయల వ్యాపారి శ్రీనివాస్ మృతి చెందాడు. బస్సు ఢీకొట్టడంతో చక్రాల కింద పడి శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ చింతల మహేష్ను గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.