byసూర్య | Sun, Oct 24, 2021, 06:51 PM
హైకోర్టు జడ్జి మాధవి రెడ్డి కుటుంబ సమేతంగా ఆదివారం వేములవాడ రాజరాజేశ్వర సామివారిని దర్శించుకున్నారు. న్యాయమూర్తి దంపతులు ముందుగా కోడె మొక్కు చెల్లించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారి కల్యాణ మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేశారు. ఆలయ ఏఈఓ ప్రతాప నవీన్ వారికి స్వామి వారి లడ్డూ ప్రసాదం అందించారు. కాగా, జడ్జి మాధవికి జిల్లా ఎస్పీ రాహుల్, అడిషనల్ కలెక్టర్ సత్య ప్రసాద్ పూలమొక్కలు అందించి ఆహ్వానం పలికారు.