byసూర్య | Sun, Oct 24, 2021, 06:02 PM
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కలిసారు. సుమారు గంటపాటు మాట్లాడుకున్నారు. మహేశ్వరం నియోజక వర్గంలో షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ఐదోరోజు కొనసాగుతోంది. పాదయాత్రకు సుబ్బారెడ్డి సంఘీభావం తెలిపారు. తాజా రాజకీయ పరిణామాలతో ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. ఆదివారం నాగారం గ్రామంలో షర్మిల బస చేసిన సమయంలో సుబ్బారెడ్డి, వైఎస్ షర్మిలను కలిసారు. ఈ భేటీలో ఏం మాట్లాడారన్నదానిపై పార్టీలో చర్చ జరుగుతోంది.