నల్గొండ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

byసూర్య | Sun, Oct 24, 2021, 05:36 PM

తెలంగాణలోని నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం తెట్ట కుంట గ్రామం లో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడు రోజుల క్రితం తెట్టే కుంట గ్రామానికి చెందిన మిట్టపల్లి కొండల్ (22 సంవత్సరాలు ) మరియు సంధ్య (19 సంవత్సరాలు ) ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగారు. అయితే వీరిద్దరు చికిత్సపొందుతూ ఇవాళ ఉదయం మరణించారు.


ఈ ఘటన వివరాల్లోకి వెళితే… వీరిద్దరూ గత కొన్ని రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. యువతి ప్రేమించిన వ్యక్తి నీ కాదని వేరొకరితో వివాహం నిశ్చయించారు పెద్దలు. దీంతో మనస్థాపం చెందిన ప్రేమజంట మూడు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది.యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అయితే ఇది గమనించిన స్థానికులు వెంటనే నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఇవ్వాళ ఉదయం ఆ జంట మృతి చెందింది. దీంతో ఆ రెండు కుటుంబాలలో విషాదం చోటు చేసుకుంది.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM