తెలంగాణకు ఇలాంటి త్రాస్టుడా ముఖ్యమంత్రి: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

byసూర్య | Sun, Oct 24, 2021, 12:54 PM

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రంతో పాటు ముఖ్యమంత్రులు దొంగల ముఠాలుగా మారారని అన్నారు. కేసీఆర్, జగన్‌లకు బీజేపీ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొనే చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు. ఏపీలో జగన్ రెడ్డి పరిపాలన దారుణంగా ఉందన్నారు. ఆయనే కొడతారు, ఆయనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బూతులపై నిజనిర్దారణ వేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. టీడీపీ బూతులు 10 శాతం ఉంటే, వైసీపీ నేతల బూతులు 90 శాంతం ఉన్నాయన్నారు. జగన్ రాక్షస పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. హుజురాబాద్‌లో బీజేపీ - టీఆర్ఎస్ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయన్నారు. ఈ విషయంలో ప్రజాస్వామ్య శక్తులు ఏకంగా కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు ఇలాంటి త్రాస్టుడు ముఖ్యమంత్రి అవుతారని అనుకోలేదని నారాయణ వ్యాఖ్యలు చేశారు.


Latest News
 

గుర్తు తెలియని మగ వ్యక్తి శవం లభ్యం Fri, Apr 19, 2024, 03:39 PM
ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపును పరిశీలించిన కలెక్టర్ Fri, Apr 19, 2024, 03:38 PM
వ్యాపార కాంక్షతోనే బీబీ పాటిల్ పోటీ Fri, Apr 19, 2024, 03:37 PM
ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెన్షన్: డీఈవో రాజు Fri, Apr 19, 2024, 03:35 PM
జాతీయ రహదారిలో ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్ Fri, Apr 19, 2024, 03:33 PM