byసూర్య | Sun, Jun 13, 2021, 12:16 PM
రాచకొండ పోలీసులు శనివారం ఆపరేషన్ ఛబుత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన, రాత్రి కర్ఫ్యూ సమయంలో అనవసరంగా బయటకొచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అందరి వివరాలు నమోదు చేసుకొని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. రాచకొండ పోలీసుల వినూత్న ప్రయోగంతో ఆకతాయిలు, పోకిరీలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రాచకొండ పరిధిలోని ఉప్పల్, బాలాపూర్, మీర్పేట పోలీస్స్టేషన్ల పరిధిలో ఒక్కో స్టేషన్ పరిధిలో 50-100 మందిని అదుపులోకి తీసుకున్నారు.