byసూర్య | Sun, Jun 13, 2021, 11:49 AM
టీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఆ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ నాయకుడు, బాలల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు తెలంగాణ సంపత్ తెలిపారు. శనివారం తెలంగాణ భవన్కు ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా పత్రాన్ని పంపించినట్టు ఆయన వెల్లడించారు. ఉద్యమంలో పనిచేసిన వారికి, పార్టీ జెండా మోసిన వారికి టీఆర్ఎస్లో భవిష్యత్తు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ అడుగుజాడల్లో నడుస్తానని సంపత్ స్పష్టం చేశారు.