byసూర్య | Sun, Jun 13, 2021, 10:55 AM
ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల14 నుంచి ఉచిత యోగా తరగతులు ప్రారంభిస్తున్నట్లు యోగా గురూజీ ఆర్.ఎస్.ప్రసాద్ తెలిపారు. కేపీహెచ్బీకాలనీలోని అందరికీ ఆరోగ్యం సంస్థ కార్యాలయంలో ఉదయం 6గంటల నుంచి 7వరకు ఆన్లైన్ విధానంలో కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవంలో భాగంగా జూన్ 21న సంస్థ కార్యాలయంలో చేపట్టే కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ను శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. ఉచిత యోగా శిక్షణలో పాల్గొనే వారు ముందస్తుగా ఫోన్ నెం. 9666590666, 9666510666 లను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.