వివాహేతర సంబంధంతో పోలీసులకు చుక్కలు చూపిన మహిళ

byసూర్య | Sat, Jun 12, 2021, 05:32 PM

ఒక మహిళ వివాహేతర సంబంధంతో నిర్మల్ జిల్లాలో పోలీసులకు చుక్కలు చూపించింది. భైంసా పట్టణంలో ఏపీనగర్ కాలనీలో ప్రియుడితో భార్య గదిలో ఉండటాన్ని గుర్తించిన భర్త వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు గదికి తాళం వేశాడు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాలనీవాసులతో పాటు పోలీసులు పెద్ద సంఖ్యంలో అక్కడికి చేరుకున్నారు. గదికి వేసిన తాళాన్ని తీసి లోపల ఉన్న జంటను బయలకు రావాలని కోరారు. అయితే ఎంత సేపటికీ లోపల నుంచి ఆ జంట బయటకురాలేదు. నాలుగు, ఐదు గంటల పాటు పోలీసులకు చుక్కలు చూపించారు. తలుపులు పగులగొడతామని పోలీసులు హెచ్చరించడంతో చివరకు ఆ జంట తలుపులు తెరిచింది. వెంటనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Latest News
 

కొందరు నాయకుల చేరికలపై అసంతృప్తి Tue, Apr 16, 2024, 05:40 PM
బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు Tue, Apr 16, 2024, 05:38 PM
పెండింగ్ కూలీ డబ్బులు చెల్లించాలి Tue, Apr 16, 2024, 05:35 PM
టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు Tue, Apr 16, 2024, 05:33 PM
ఈనెల 19న వంశీచంద్ రెడ్డి నామినేషన్: ఎమ్మెల్యే వాకిటి Tue, Apr 16, 2024, 05:31 PM