byసూర్య | Sat, Jun 12, 2021, 05:06 PM
భూదందాల వెనుక మంత్రి కేటీఆర్ టీమ్ ఉందని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. శనివారం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ... 70మందికి పైగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై భూకబ్జాల ఆరోపణలున్నాయన్నారు. టీఆర్ఎస్ నేతల భూముల ధరల కోసమే 13 లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టారన్నారు.రాష్ట్రంలో జరిగే ప్రతి భూలావాదేవీ వెనుక కేటీఆర్ టీం ప్రమేయముందని చెప్పారు. కేటీఆర్ మిత్రబృందం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందన్నారు. భూముల అమ్మకాలు ఆక్రమణదారులకు వరంగా మారనుందదన్నారు. భూముల అమ్మకాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కల్తీ విత్తనాలను అమ్మే వారిని వెంటనే అరెస్ట్ చేయలేకపోతున్నారని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు.