వచ్చేనెల 25, 26వ తేదీల్లో బోనాలు

byసూర్య | Sat, Jun 12, 2021, 03:26 PM

జూలై 25, 26వ తేదీల్లో సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర జరుగుతుందని ఆలయ ఈవో గుత్త మనోహర్‌రెడ్డి తెలిపారు. శుక్ర వారం ఈవో, ఆలయ వేద పండితులు, అర్చకులతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను ఆయన నివాసంలో కలిశారు. జూలై 11న అమ్మవారి ఘటోత్సవం, 25న బోనాలు, 26న రంగం కార్యక్రమం ఉంటుందని మంత్రి సమక్షంలో ప్రకటించారు.ఈ సందర్భంగా కరోనా నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం మాత్రమే బోనాల జాతర నిర్వహించాలని మంత్రి తెలిపారు. దేవాలయ ప్రసాదంతో పాటు వేదపండితులు ఆశీర్వచనాలను మంత్రికి అందించారు.


 


 


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM