ప్రియుడి కోసం కన్న కొడుకును కొట్టి చంపిన తల్లీ.. ప్రియుడి తో సహా అరెస్టు

byసూర్య | Sat, Jun 12, 2021, 01:01 PM

జీడిమెట్ల లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని కన్న కొడుకును కొట్టి చంపిన కేసులో బాలుడి తల్లితో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. జీడిమెట్ల సీఐ కె.బాలరాజు వివరాల ప్రకారం.. చింతల్‌ భగత్‌సింగ్‌ నగర్‌కు చెందిన కంజెర్ల ఉదయ(24), సురేష్‌ భార్యాభర్తలు. వీరికి కుమారుడు ఉమేష్‌(3) ఉన్నాడు. కాగా ఉదయ జగద్గిరిగుట్టకు చెందిన సెంట్రింగ్‌ మేస్త్రీ భాస్కర్‌ (26) తో చనువుగా ఉండసాగింది.


భార్య ఉదయలో తేడాను గమనించిన సురేష్‌ తరచూ ఆమెతో గొడవపడేవాడు. దీంతో ఉదయ సంవత్సరం నుంచి భర్త సురేష్‌తో గొడవపడి చింతల్‌ మారుతీనగర్‌లో అద్దె గదిలో భాస్కర్‌తో కలిసి ఉంటుంది. ఈ నెల 8వ తేదీన ఉదయ ప్రియుడు భాస్కర్‌తో కలిసి కుమారుడు ఉమేష్‌ను తీవ్రంగా కొట్టింది. దెబ్బలకు తాళలేక ఉమేష్‌ ఇంట్లోనే మృతిచెందాడు. దీంతో కంగారుపడిన ఉదయ, భాస్కర్‌లు ఉమేష్‌ను చికిత్స నిమిత్తం మల్లారెడ్డి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన అక్కడి వైద్యులు బాలుడు ఉమేష్‌ అప్పటికే మృతిచెందినట్లు తెలిపి అతడి ఒంటిపై దెబ్బలు అనుమానంగా ఉండటంతో అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఉదయ, భాస్కర్‌లను అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం ఇద్దరిపై హత్య కేసు నమోదు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.


Latest News
 

150 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరికలు Sat, Apr 20, 2024, 10:49 AM
ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి Sat, Apr 20, 2024, 10:34 AM
కాంగ్రెస్ పార్టీలో చేరికలు Sat, Apr 20, 2024, 10:32 AM
గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM