byసూర్య | Sat, Jun 12, 2021, 11:37 AM
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు యాదాద్రిని సందర్శించనున్నారు. యాదాద్రి పనుల పురోగతిని పరిశీలించనున్నారు. కేసీఆర్తో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, గవర్నర్ తమిళి సై లు సైతం యాదాద్రికి వెళ్లనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి హోదాలో మొదటిసారి యాదాద్రిని ఎన్వీ రమణ దర్శించుకోనున్నారు. సీజేఐ హోదాలో వస్తుండటంతో ఘనంగా స్వాగతం పలికేందుకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేస్తోంది.