మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధరలు

byసూర్య | Sat, Jun 12, 2021, 10:04 AM

చమురు కంపెనీలు వినియోగదారులకు షాక్‌ ఇస్తూనే ఉన్నాయి. మరోసారి శనివారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచాయి. ఈ నెలలో వరుసగా ఏడోసారి ధరలు పైకి కదిలాయి. తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై 28 పైసలు, లీటర్‌ డీజిల్‌పై 25 పైసలు పెరిగింది. కొత్తగా పెంచిన ధరలో దేశ రాజధాని ఢిల్లీలో ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరాయి. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.85, డీజిల్‌ రూ.86.75కు చేరింది. మరో వైపు ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో నెలలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.102.30కు చేరుకుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్‌ రూ.100 మార్క్‌ను దాటగా.. డీజిల్‌ సైతం రూ.100 వైపు పరుగులు పెడుతున్నది. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లడఖ్‌లో పెట్రోల్ లీటర్‌ లీటర్‌ రూ.100 మార్క్‌ను దాటింది. మే 4వ తేదీ నుంచి నేటి వరకు 24 సార్లు చమురు ధరలు పెరిగాయి.


Latest News
 

కళ్లు చెదిరేలా అక్రమాస్తులు, అన్ని కోట్లా..,,,సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమా నివాసాల్లో ఏసీబీ సోదాలు Tue, Apr 23, 2024, 08:05 PM
మ్యారేజ్ రిసెప్షన్‌లో తాటిముంజలు.. వేసవి వేళ బంధువులకు అదిరిపోయే విందు Tue, Apr 23, 2024, 08:01 PM
ఏపీలో ఎన్నికలకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. టీఎస్‌ఆర్టీసీ స్పెషల్ బస్సులు Tue, Apr 23, 2024, 07:55 PM
చదువుపై మక్కువ.. వద్దంటే పెళ్లి చేసిన పేరెంట్స్, పాపం నవ వధువు Tue, Apr 23, 2024, 07:48 PM
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి వియ్యంకుడు నామినేషన్.. అధిష్టానం ప్రకటించకుండానే Tue, Apr 23, 2024, 07:44 PM