byసూర్య | Sat, Jun 12, 2021, 10:04 AM
చమురు కంపెనీలు వినియోగదారులకు షాక్ ఇస్తూనే ఉన్నాయి. మరోసారి శనివారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. ఈ నెలలో వరుసగా ఏడోసారి ధరలు పైకి కదిలాయి. తాజాగా లీటర్ పెట్రోల్పై 28 పైసలు, లీటర్ డీజిల్పై 25 పైసలు పెరిగింది. కొత్తగా పెంచిన ధరలో దేశ రాజధాని ఢిల్లీలో ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.95.85, డీజిల్ రూ.86.75కు చేరింది. మరో వైపు ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో నెలలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.30కు చేరుకుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ రూ.100 మార్క్ను దాటగా.. డీజిల్ సైతం రూ.100 వైపు పరుగులు పెడుతున్నది. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లడఖ్లో పెట్రోల్ లీటర్ లీటర్ రూ.100 మార్క్ను దాటింది. మే 4వ తేదీ నుంచి నేటి వరకు 24 సార్లు చమురు ధరలు పెరిగాయి.