byసూర్య | Fri, Jun 11, 2021, 04:27 PM
మహాత్మాజ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశానికి గడువు పొడిగించినట్టు విద్యాసంస్దల కార్యదర్శి మల్లయ్యభట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురుకుల విద్యాలయాల సంస్థ బాల బాలికలకు ఇంగ్లీష్ మీడియం, జూనియర్ కళాశాలలు, మహిళా డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 21వ తేదీ వరకూ గడువును పొడిగించారు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవ చ్చని తెలిపారు. బిసి, ఎస్సి, ఎస్టీ, ఈబీసి విద్యార్ధినీ విద్యార్ధులు ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని కోరారు.