byసూర్య | Fri, Jun 11, 2021, 03:05 PM
హైదరాబాద్: పెట్రోల్, డీజీల్ పెరుగుదలపై ఎమ్మెల్యే సీతక్క కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ధరలు చూస్తుంటే సామాన్యులు బతికే పరిస్థితి లేదన్నారు. పెట్రోల్, డీజిల్కు అయ్యే ఖర్చు రూ. 30 అయితే టాక్సుల పేరుతో రూ. 60 అదనపు భారం ప్రజలపై మోపుతున్నారని మండిపడ్డారు. కరోనా కష్టకాలంలో ఉన్న ప్రజలకు ఎలాంటి రాయితీలు, నిత్యావసర వస్తులు ఇవ్వని ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలకు మాత్రం లక్షల, కోట్ల రూపాయల రాయితీలు ఇస్తున్నారని సీతక్క ఆరోపించారు.