ఆగస్ట్ మొదటి వారంలో ఎంసెట్ పరీక్ష..!

byసూర్య | Fri, Jun 11, 2021, 12:15 PM

ఇప్పటివరకు ఎంసెట్‌కు 2,20027 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 15న ఎసెంట్ దరఖాస్తు గడువు ముగియనుంది. అయితే ఆగస్ట్ మొదటి వారంలో ఎసెంట్ పరీక్షలు జరిగే అవకాశముందని తెలుస్తోంది. జూలై 5 నుంచి 9 వరకు జరిగే పరీక్షలను ఆగస్ట్ మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉంది. ఎసెంట్ గడుపు పెంపుపై రెండు మూడు రోజుల్లో ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకోనుంది. ఇంటర్ పరీక్షల రద్దుతో ఎంసెట్ నిర్వాహణపై విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పరీక్షలు ముగిసిన నాటి నుంచి ఎంసెట్ ప్రిపరేషన్‌కు ఆరువారాల గడువు ఇవ్వడం ఆనవాయితీగా మారింది. ఎసెంట్ పరీక్ష లేకుండా విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడికల్ సీట్లు కేటాయింపు చేయడం అసాధ్యమని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. వరుసగా పరీక్షల రద్దుతో మెరిట్ స్టూడెంట్లు నష్టపోతారని అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు ఎంసెట్ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం మంచిదని అధికార వర్గాలు చెబుతున్నాయి.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM