రంగారెడ్డి జిల్లాకు రానున్న షర్మిల

byసూర్య | Thu, Jun 10, 2021, 02:40 PM

వైఎస్ షర్మిల దూకుడు మీద ఉన్నారు. పార్టీ ఏర్పాటుపై ఇప్పటికే కార్యాచరణ రూపొందిస్తున్న షర్మిల..జిల్లాల పర్యటనకు సిద్ధమౌతున్నారు. అందులో భాగంగా..2021, జూన్ 11వ తేదీ శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. ఐకెపి సెంటర్లలో ఉన్న ధాన్యాన్ని ఆమె పరిశీలించనున్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.


ఇప్పటికే పలు జిల్లాలకు సంబంధించిన వైఎస్ఆర్ అభిమానులు, ఇతర నేతలతో షర్మిల సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పార్టీ ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. జూలై 8వ తేదీన వై.యస్.ఆర్.టి.పి(YSRTP) పార్టీ పేరును ఆమె లాంఛనంగా ప్రకటించనున్నారని సమాచారం.


జూలై 8న దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి పుట్టిన రోజు. అదే రోజు పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన తెలంగాణలో మళ్ళీ తీసుకురావడం కోసం, వైఎస్ ఆశయాలు, ఆలోచనలు ప్రతిబింబించేలా, వైఎస్ అందించిన సంక్షేమం .. ప్రతి ఇంటికి మళ్ళీ చేరేలా "YSR తెలంగాణ" పార్టీ పెట్టాలనుకుంటున్నట్లు షర్మిల ఇప్పటికే తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా..రంగారెడ్డి జిల్లాలో షర్మిల పర్యటించబోతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.


Latest News
 

ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM
అదే జరిగితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: మంత్రి కోమటిరెడ్డి Wed, Apr 24, 2024, 07:58 PM
ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితపై ఈడీ కీలక విషయాలు.. బెయిల్ పిటిషన్ రిజర్వ్ Wed, Apr 24, 2024, 07:53 PM