byసూర్య | Thu, Jun 10, 2021, 11:13 AM
వరంగల్: జిల్లాలోని చెన్నారావుపేట మండలంలో గల ఉప్పరపల్లి గ్రామంలో చేతబడుల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. రాత్రికి రాత్రే ఓ యువకుడు మాయమయ్యాడు. గతంలో ఇదే తరహాలో ఒకరు అదృశ్యం అయ్యారు. అయితే ఇప్పటివరకు లభించని ఆచూకీ లభించలేదు. గ్రామంలో రాత్రికి రాత్రే చీమల సతీష్ (28) అనే వ్యక్తి రాత్రి పడుకొని ఉదయం లేచి చూసే సరికి మనిషి మాయమయ్యాడు. పడుకున్న మంచం పక్కకు చేతబడి చేసిన ఆనవాళ్లు గ్రామస్థులకు కనిపించాయి.
మంచం పక్కన మనిషి బొమ్మ, ముగ్గు గీసారు. అందులో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, మిరపకాయలు, బొగ్గు వేసి చేతబడి చేసినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఇదే తరహాలో ఒక వ్యక్తి అదృశ్యం అయ్యాడని, అయితే ఇప్పటివరకు అతని ఆచూకీ లభించలేదని గ్రామస్తులు తెలిపారు. ఈ సంఘటనతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు.