byసూర్య | Thu, Jun 10, 2021, 09:55 AM
హైదరాబాద్: రాష్ట్రంలో ఈరోజు నుంచి పగటిపూట లాక్డౌన్ను ఎత్తివేస్తూ...సడలింపు సమయాన్ని ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో సేవల సమయాన్ని పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మెట్రో సేవలు కొనసాగనున్నాయి. అన్ని చివరి స్టేషన్ల నుంచి సాయంత్రం 5 గంటలకు చివరి రైలు బయలుదేరనుంది. పొడింగించిన సమయం ఈరోజు నుంచి అమలులోకి రానుంది.