byసూర్య | Wed, Jun 09, 2021, 02:00 PM
జంటనగరాల్లో వర్షాకాలంలో నాలాలు పొంగకుండా వాటి పూడిక తీసే పనులను ముమ్మరంగా జరుగుతున్నాయని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. బుధవారం నగరంలోని సనత్ నగర్ నియోజక వర్గం పరిధిలోని రాంగోపాల్పేటలో నాలా వంతెన నిర్మాణ పనులను మంత్రి తనిఖీ చేశారు. నగరంలోని నాలాల పూడిక తొలగింపు కార్యక్రమానికి 45కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలిపారు. 124 ప్రాంతాల్లో ఉన్న 221 కి.మీ. నాలాలకు గాను 207 కి.మీ. పూడిక తీత పనులు పూర్తయ్యాయనని ఆయన తెలిపారు నాలాల పూడిక తీత వల్ల వర్షాకాలంలో వరద నీరు సాఫీగా వెళ్లడానికి అవకాశం ఉంటుందన్నారు.