byసూర్య | Wed, Jun 09, 2021, 12:10 PM
కుత్బుల్లాపూర్ గాజులరామారం వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద గందరగోళం నెలకొంది. వ్యాక్సిన్ కోసం జనం వేలాదిగా రావడంతో ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. జీహెచ్ఎంసీ సిబ్బందితో ప్రజలు వాగ్వాదానికి దిగారు. స్లాట్ బుక్ చేసిన సమయం కంటే ముందుగానే జనం రావడంతో గందరగోళ పరిస్థితికి దారి తీసింది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిలిపివేశారు.