byసూర్య | Tue, Jun 08, 2021, 03:20 PM
తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ధరణిపై ఫిర్యాదుల కోసం వాట్సప్ నంబర్ను కేటాయించారు. రెండు రోజుల్లో 6 వేల దరఖాస్తులు అందాయి. రేపటి లోగా పరిష్కరించాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. 15 నుంచి రైతు బంధు సాయం అందించనున్నారు. ఈ నెల 15 నుంచి రైతుల ఖాతాలోకి రైతు బంధు సాయం పడనుంది. కాగా చాలా మంది రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పాస్ బుక్లు రాక, రైతు బంధు జమ కాక రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.