byసూర్య | Tue, Jun 08, 2021, 12:50 PM
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ " టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ " ఆధ్వర్యంలోని స్పోర్ట్స్ స్కూల్స్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలయింది. అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో రెండు క్రీడా పాఠశాలలు కొనసాగుతున్నాయి. బాలురు, బాలికల పాఠశాలల్లో కలిపి మొత్తం 80 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత విద్యతోపాటు పీటీ డ్రెస్, ట్రాక్ సూట్, కిట్ బ్యాగ్ మొదలైనవి అందిస్తారు. ఏటూరు నాగారంలో బాలుర గురుకుల, చేగుంటలో బాలికల గురుకుల పాఠశాల ఉన్నది. ఒక్కో పాఠశాలలో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
అర్హత: నాలుగో తరగతి పూర్తయి ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.2 లక్షలు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.50
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 24
వెబ్సైట్: www.tgtwgurukulam.telangana.gov.in